బాబు, పవన్‌, బీజేపీ, షర్మిల కలిసి వచ్చినా మళ్లీ జగనే సీఎం – తమ్మినేని సీతారాం

-

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ, సీపీఎం, వైఎస్‌ షర్మిల కలిసి వచ్చినా ఈ రాష్ట్రానికి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అయి తీరుతాడంటూ దీమ వ్యక్తం చేశారు.ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ యార్డులో నాలుగు మండలాలు మరియు మున్సిపాలిటీ నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు మండలాల నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన పనిని క్రమబద్ధంగా, బాధ్యతతో నిర్వహించాలని , చంద్రబాబు,బీజేపీ,పవన్‌, సీపీఎం, వైఎస్‌ షర్మిల కలిసి వచ్చినా.. మళ్లీ వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని ,మరోసారి వైఎస్‌ జగనర్మోహన్‌రెడ్డి సీఎం అయి తీరుతారంటూ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కి మూడుసార్లు అధికారం ఇచ్చిన ఏమి చేయలేకపోయాడని మండిపడ్డారు.మళ్ళీ ఒక్క అవకాశం అడుగుతున్నావు ఎందుకు చంద్రబాబు..? ,మా ప్రభుత్వ హయాంలో మీ కుటుంబానికి మేలు జరిగితే ఓటు వెయ్యండని అడిగిన సీఎం చరిత్రలో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు .

Read more RELATED
Recommended to you

Latest news