విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు లలితాత్రిపుర సుందరిదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీ చక్ర అధిష్ఠాన శక్తిగా అమ్మ కొలువుదీరింది. దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భ్రమరాంబదేవి కుష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
లలితాత్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మవారు
-
Previous article
Next article