ఈ నెల 6న లాంచ్‌ కానున్న Redmi 11 Prime 5G..

-

రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌ ఈనెల 6న లాంచ్‌ కానుంది. అదే రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్. రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్‌తో పాటు ఈ ఫోన్‌ కూడా విడుదల చేయనున్నారు. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ..
రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించారు.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
ఇందులో వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను అందించనున్నారు.
 ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
బ్లాక్, మింట్ గ్రీన్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీలో టియర్ డ్రాప్ తరహా డిస్‌ప్లేను అందించనున్నారు.
ఈ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.
సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన లాండింగ్ పేజ్ కూడా కంపెనీ వెబ్‌సైట్లో చూడవచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. కనీసం మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గతంలో ఎంఐ ఏ-సిరీస్‌లో ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేవి. ఇప్పుడు రెడ్‌మీ ఏ-సిరీస్‌లో వస్తున్నాయి
వీటితో పాటు రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా కంపెనీ ప్రకటించింది. రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉండనుంది. కానీ ప్రాసెసర్ పేరు మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ ద్వారా ‘క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్’ అందించనుందని షావోమీ ప్రకటించింది. యూజర్ ఇంటర్ ఫేస్ లేకుండా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో రెడ్‌మీ ఏ1 లాంచ్ కానుందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news