ఇది పెయింటింగ్‌ కాదు.. టీవీ!

-

పెయింటింగ్‌ను పోలి ఉన్న టీవీని మీరు ఎప్పుడైనా చూశారా? ఈ కొత్తరకం టీవీని ప్రముఖ దిగ్గజ సంస్థ శాంసంగ్‌ పరిచయం చేసింది. దాని పేరు శాంసంగ్‌ ది ఫ్రేమ్‌ టీవీ 2021 సిరీస్‌. ఇది 43 – 65 అంగుళాల వరకు వివిధ సైజుల్లో అందుబాటులో ఉంది. ఈ టీవీ భారత్‌లో కూడా విడుదలైంది. టీవీ అంచుల డిజై న్‌
ను వివిధ రకాలుగా మార్చుకోవచ్చు. ఇందులో 1400 వరకు ఆర్ట్‌ పీస్‌లు ఉన్న ప్రీలోడెడ్‌ లైబ్రరీ ఉంది. అంటే టీవీని ఆఫ్‌ చేసినప్పుడు దీన్ని ఒక పెయింటింగ్‌లా పెట్టుకోవచ్చన్న మాట. గతంలో వచ్చిన మోడల్‌ కంటే సన్నగా ఉంది. దీన్ని చూడగానే పిక్చర్‌ ఫ్రేమ్‌లా అనిపిస్తుంది.

మనదేశంలో ఈ టీవీ ధర రూ.61,990 నుంచి ప్రారంభం కానుంది. 43 , 50, 55, 65 అంగుళాల సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్‌ ఆ న్‌లైన్‌ స్టోర్లలో జూన్‌ 12వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. 12– 21వ తేదీలోపు ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.9,990 విలువైన బెజెల్‌ను ఉచితంగా అందించనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 క్యాష్‌ బ్యాక్‌ లభించనుంది. అలాగే 24 నెలల వరకు నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ టీవీ కొనుగోలు చేయడానికి కేవలం నెలకు రూ.2,000లోపే చెల్లించి ఈ టీవీని కొనుక్కోవచ్చు. ఈ టీవీలో క్వాంటం డాట్‌ కలర్‌ టెక్నాలజీ ద్వారా 100 శాతం కలర్‌ వాల్యూమ్‌ను ఇందులో అందించారు. క్వాంటం ప్రాసెసర్‌ 4కేపై ఈ టీవీ పనిచేస్తుంది. ఈ టీవీకి వాల్‌ మౌంట్‌ ఆప్షన్‌ ఉంటుంది. కానీ, పెయింటింగ్‌ మాదిరి దీని లుక్‌ కనిపించేందుకు స్టాండ్‌ను కూడా కంపెనీ ఉచితంగా అందిస్తోంది. స్క్రీన్‌ మీద ఏ ఆర్ట్‌ ఫాం కనిపించాలో కూడా సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఇందులో 1200 ఫొటోలతో పాటు 6 జీబీ స్పేస్‌ను కూడా శాంసంగ్‌ కేటాయించింది. దీంతోపాటు మరిన్ని ఫీచర్లను రానున్న రోజుల్లో పరిచయం చేయనున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం వాల్‌ పెయింటింగ్‌ కమ్‌ టీవీని మీ సొంతం చేసేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news