మా తాత, మావయ్యలే నాకు ఆదర్శం…

-

తండ్రి ఆశీస్సులతో..ముందుకెళ్తా..

తాతా..ఎన్టీఆర్, మావ చంద్రబాబు నాయుడులే తనకు రాజకీయాల్లో ఆదర్శమని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగు దేశ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న నందమూరి సుహాసిని వెల్లడించారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాలలోకి వచ్చానన్నారు. ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నానని సుహాసిని చెప్పారు.  శనివారం  నామినేషన్ దాఖలు  చేసిన తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తామన్నారు. తన తండ్రి  నందమూరి హ‌రికృష్ణ‌ ఆశీస్సులతో రాజకీయాల్లో సేవ చేస్తానని ఆమె పేర్కొన్నారు. మొదటి సారి మీడియా ముందుకు వచ్చిన సుహాసిని తన తండ్రి చిత్ర పటానికి నివాళులర్పిస్తుూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

శనివారం ఉదయం 11.21 గంటలకు సుహాసిని నామినేషన్ వేయనున్నారు. అంతకంటే ముందు తన తండ్రి, తాతలకు నివాళులర్పించి బాబాయి బాలకృష్ణ‌తో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news