ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: రూ. 599తో రూ.4 లక్షలు

-

ఎయిర్ టెల్ సంస్థ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ప్రీ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అన్నమాట. రూ. 599 ప్రీపెయిడ్ పథకంతో రీఛార్జి చేసుకున్న చందాదార్లకు ఏకంగా రూ.4 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్టు ప్రకటించింది.

ఈ పథకం కింద రూ.599తో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే.. ఏ నెట్ వర్క్ కు అయినా 84 రోజుల పాటు అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 సంక్షిప్త సందేశాలు పంపుకోవచ్చు. రోజుకు 2జీబీ డేటా వాడుకోవచ్చు. వీటితో పాటు రూ.4 లక్షల జీవిత బీమా కూడా పొందవచ్చు.

రూ.599తో రీఛార్జి చేసుకున్న ప్రతిసారి, బీమా 3 నెలల చొప్పున వర్తిస్తుంది. ఇందుకోసం పత్రాలేమీ నింపాల్సిన అవసరం లేదు. వైద్య పరీక్షలూ అక్కర్లేదు. రీఛార్జి జరగ్గానే బీమా డిజిటల్ పత్రం జారీ అవుతుంది. 18-54 ఏళ్ల వారికి మాత్రమే చెల్లుతుంది.

వినియోగాదాలకు ఈ బీమా రక్షణ కల్పించేందుకు ఎయిర్ టెల్ సంస్థ.. భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తొలి రీఛార్జి చేయగానే, ఎస్ఎంఎస్ లేదా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లేదా యిర్టెల్ రిటైలర్ ద్వారా చందాదారు పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ను ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా దేశం అంతటా విస్తరిస్తారు. ఫోన్ రీచార్జ్ తో పాటు ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్న ఈ ప్లాన్ బాగా సక్సస్ అయ్యే ఛాన్సుంది.

Read more RELATED
Recommended to you

Latest news