LIC పాలసీదారులకు అలర్ట్…!

-

దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ని అందిస్తోంది. అదే విధంగా వివిధ రకాల ప్లాన్స్ కూడా ఎల్ఐసి లో వున్నాయి. ఎండోమెంట్ ప్లాన్స్, చిల్డ్రన్స్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, హెల్త్ ప్లాన్స్ ఇలా చాల రకాల పాలసీలు వున్నాయి. వీటితో చాల మంది అనేక లాభాలు పొందుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా ఎల్ఐసీ కస్టమర్స్ ని అలెర్ట్ గా ఉండమని చెప్పింది. మోసగాళ్లు కూడా ఎల్‌ఐసీ పాలసీదారులను టార్గెట్ చేస్తున్నారని… వారి నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు తెలుస్తోంది. అందువల్ల మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎల్‌ఐసీ తన పాలసీదారులను హెచ్చరిస్తోంది.

లేదంటే మోసపోవాల్సి వస్తుందని అప్రమత్తం చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎల్‌ఐసీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. నేటి కాలం లో ఈ తరహా మోసాలు ఎక్కువయి పోయాయి. కనుక మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లను అలర్ట్ చేసింది.

ఐఆర్‌డీఏఐ అధికారులమని కూడా ఫోన్ కాల్స్ రావొచ్చని పేర్కొంది. పాలసీలు తీసుకుంటే బెనిఫిట్స్ పొందొచ్చని చెప్పి మోసం చేస్తారని అంది.

Read more RELATED
Recommended to you

Latest news