తండ్రి అప్పులను చెల్లించాల్సిన బాధ్యత కుమార్తెలపై ఉంటుందా..?

-

బతికి ఉన్నప్పుడు ఏవేవో ప్లాన్స్‌ వేసుకుంటాం. జీవితం కోసం ఎంతో ముందు ఆలోచన. అందులో భాగంగానే అవసరాలకు తగ్గట్టుగా చాలా మంది లోన్స్‌ తీసుకోవడం, బయట అప్పు చేయడం వంటివి చేస్తుంటారు. కానీ అవి పూర్తిగా చెల్లించకముందే చనిపోతే.. ? తండ్రి అప్పులను చెల్లించాల్సిన బాధ్యత వారసులపై ఎంత ఉంటుంది. తండ్రి ఆస్తులలో కుమార్తెలకు వాటా ఉంటుంది. మరీ అప్పులలో ఉండదా..? దాని సంగతేంటి..? కుమార్తెలు తండ్రి అప్పులను చెల్లించాలా లేదా..? న్యాయ నిపుణులు ఏం అంటున్నారు..?

ఓ వ్యక్తి చనిపోతే అతని ఆస్తులు వారసులకు చెందుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అతనికి ఎంత మంది సంతానం ఉంటే.. వారందరికీ సమానంగా ఆ ఆస్తిని పొందే హక్కు చట్టం కల్పించింది. కొడుకులు, కూతుళ్లనే తేడా లేకుండా ఆస్తిని పొందే హక్కు ఉంటుంది. అయితే ఓ వ్యక్తి మరణిస్తే అతనికి ఉన్న అప్పుల సంగతేంటి? వాటిని ఎవరు చెల్లించాలి? అన్న విషయంలో నేటికీ అనేక సందేహాలు ఉన్నాయి.

ఆ అప్పులకు, మాకు ఎలాంటి సంబంధం లేదని వారసులు తప్పించుకోవచ్చా? లేదా మా నాన్న మాకు ఏమీ ఇవ్వలేదు కాబట్టి మేము ఆ అప్పులను చెల్లించలేమని చెప్పొచ్చా? ఇలాంటి వివాదాలకు సంబంధించిన వార్తలను డైలీ చూస్తూనే ఉంటాం కదా..! చనిపోయిన వ్యక్తికి అప్పులు ఉంటే అతని వారసులే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

వారసుడు ఒక్కడే ఉంటే అతనే ఆ మొత్తన్ని చెల్లించాలని చట్టంలో స్పష్టంగా ఉంది. ఒక వేళ ఒకరి కన్నా ఎక్కువ మంది వారసులు ఉంటే.. వారంతా ఆ అప్పును సమానంగా చెల్లించాలని చెబుతున్నారు. అయితే.. తండ్రి అప్పులు చెల్లించే బాధ్యత కుమారులపై ఎంత ఉందో.. కూతుర్లపై కూడా అంతే ఉంటుందని వివరిస్తున్నారు న్యాయ నిపుణులు. ఓ వ్యక్తికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అతనికి ఉన్న అప్పును మూడు భాగాలు చేసి.. ముగ్గురూ సమానంగా చెల్లించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news