పోస్టాఫీస్: ఈ స్కీమ్ తో భార్యాభర్తలు రూ.60 వేలు పొందొచ్చు..!

-

పోస్టాఫీస్‌ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన చాలా ప్రయోజనాలని పొందొచ్చు. పోస్టాఫీస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యడం వలన మంచి రాబడి కూడా వస్తుంది. అదే విధంగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అంతే కాదు పలు స్కీమ్స్‌ కి కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

పోస్టాఫీస్‌లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. వీటిలో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో కనుక చేరితే ప్రతి నెలా ఖచ్చితమైన రాబడి పొందొచ్చు. ఈ స్కీమ్ లో డబ్బుల్ని ఒకేసారి ఇన్వెస్ట్ చెయ్యాల్సి వుంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా నెలకు రూ.4950 వరకు పొందొచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు.

ఇక ఈ స్కీమ్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అనేది చూస్తే.. ఈ స్కీమ్ ద్వారా రూ.59,400 వరకు లభిస్తాయి. మీరు రూ.1000 నుంచి డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్ లో గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.

ఒకవేళ కనుక ఇద్దరూ చేరితే రూ.9 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే.. ఏడాదికి రూ.59,400 వస్తాయి. అంటే నెలకు రూ.4950 వస్తాయి. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.6 శాతం వడ్డీ వస్తోంది. రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్‌కు ఈ స్కీమ్ చాలా బెస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news