కరెన్సీ నోటుపై ఉన్న గాంధీజీ ఫోటోను ఎవరు తీశారో తెలుసా?

-

మన కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ నవ్వుతున్న ఫోటో చూస్తుంటాం. ఈ ఫోటో గురించి మనందరికీ తెలుసు. అయితే ఆ ఫోటో వెనుక ఉన్న కథ ఏంటి అని దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ చాయాచిత్రం గీసిన వ్యంగ్య చిత్రం అని జనాదరణ పొందిన ఆ నమ్మకానికి విరుద్ధంగా ఆ చిత్రం గీసినది కాకుండా, తీసిన ఫోటో అది. అయితే ఆ ఫోటో ఎక్కడ నుండి తీసుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

 

లార్డ్ ఫెడరిక్ విలియం పెథిక్ – లారెన్స్ బ్రిటిష్ రాజకీయవేత్త 20వ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాలలో గ్రేట్ బ్రిటన్లో మహిళా ఓటు హక్కు ఉద్యమ నాయకురాలు, బర్మా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. గాంధీజీ అతని పక్కన నిలబడి ఉన్నప్పుడు తెలియని ఫోటోగ్రాఫర్ తీసిన చిత్రమిది.

1946వ సంవత్సరంలో ఈ ఫోటోలో గాంధీజీ ఒక వ్యక్తిని చూసి నవ్వుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి అతను తీసిన ఫోటో కుడివైపుకు తిరిగి ఉంటుంది. కానీ మన ఇండియన్ కరెన్సీ నోట్లమీద ఎడమవైపుకు తిరిగి ఉంటుంది. దీనికి కారణం వారు కరెన్సీ నోటుపై మిర్రర్ ఇమేజ్ ని వాడారు. అందుకే కరెన్సీ నోటుపై గాంధీజీ ఎడమవైపు తిరిగి ఉంటాడు. ఈ ఫోటో మాజీ వైస్రాయ్ హౌస్ వద్ద తీయబడింది. ఆ వైస్రాయ్ హౌస్ నే ఇప్పుడు రాష్ట్రపతి భవన్ అని మనందరికీ తెలుసు.

Read more RELATED
Recommended to you

Latest news