ఎస్బీఐ కస్టమర్స్ కి గుడ్ న్యూస్… ఆన్లైన్ లోనే ఇప్పుడు ఈ ఫెసిలీటీ పొందండి…!

-

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక రకాల సర్వీసులని ఇస్తోంది. వీటి వలన ప్రజలకి ఎన్నో బెనిఫిట్స్ కలుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని కొత్త రకం సేవలు కూడా అందుబాటులోకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకో వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

ఎస్బీఐ కస్టమర్స్ ఇప్పుడు తమ మొబైల్ నెంబర్ ని ఇంట్లో వుండే అప్‌డేట్ చేసుకోవచ్చు. కేవలం మొబైల్ నెంబర్ ని మార్చుకోవడానికి బ్యాంక్ కి వెళ్ళక్కర్లేదు. నిమిషాల్లో ఇంటి నుండే పని పూర్తి చేసుకోవచ్చు. అయితే దీని కోసం మీ వద్ద ఏటీఎం కార్డు ఉంటే చాలు. అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి.

ఎస్‌బీఐ కస్టమర్లు మూడు ఆప్షన్లలో వారి మొబైల్ నెంబర్ మార్చుకో వచ్చు. నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. మొదట పర్సనల్ డీటైల్స్‌లోకి వెళ్లాలి. ఇక్కడ ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.

తర్వాత పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్ దగ్గర చేంజ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాత మొబైల్ నెంబర్‌కు, కొత్త మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసాక మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది అంతే.

 

Read more RELATED
Recommended to you

Latest news