అదిరే ప్రభుత్వ స్కీమ్.. అకౌంట్‌లోకి నెల నెలా రూ.9 వేలు..!

-

మీరు ఇన్కమ్ ని పొందాలని చూస్తున్నారా..? అది కూడా రిస్క్ లేకుండా రాబడి పొందే అవకాశం గురించి ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీకోసం. డబ్బులతోనే డబ్బు సంపాదించే అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఒకటి లభిస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతినిలా తొమ్మిది వేలకు పైగా పొందవచ్చు. అకౌంట్లోకి వచ్చి మీ డబ్బులు జమవుతాయి. కేంద్ర ప్రభుత్వం హామీ కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీం ఒకటి అందుబాటులో ఉంది. దీని ద్వారా ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. ఇందులో మీరు వెయ్యి రూపాయలు నుంచి తొమ్మిది లక్షలు వరకు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.

జాయింట్ అకౌంట్ తీసుకున్నట్లయితే 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. పోస్ట్ ఆఫీస్ కి మెచ్యూరిటీ గడువు 5 ఏళ్ళు. ఈ స్కీం పై ప్రస్తుత 7.4% వడ్డీ లభిస్తుంది. ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా ఉంటుంది. ఎక్కువ పెడితే ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.3,000 వరకు వస్తాయి. తొమ్మిది లక్షలు పెడితే నెలకి 5500 వస్తాయి. అదే మీరు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం లో 15 లక్షల పెట్టినట్లయితే 9250 నెలకు వస్తాయి.

ఈ స్కీం లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం పై వచ్చే వడ్డీ రాబడి నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో జమవుతుంది. డబ్బులు పెట్టిన ఏడాది తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. మూడేళ్లలోపు అకౌంట్ క్లోజ్ చేసుకుంటే రెండు శాతం పెనాల్టీ పడుతుంది. ఐదేళ్లు టెన్యూర్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అకౌంట్ క్లోజ్ చేసి లేదంటే డిపాజిట్ దారుడు మరణిస్తే అకౌంట్ క్లోజ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news