రూ.29తో రూ.4 లక్షలు ఈ పాలసీతో పొందొచ్చు..!

-

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. వీటి వలన ఎన్నో లాభాలనై పొందొచ్చు. పిల్లల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు వివిధ రకాల పాలసీలని ఇస్తోంది. అలానే మహిళల కోసం కూడ ప్రత్యేక పాలసీ అందిస్తోంది. దీని పేరు ఎల్‌ఐసీ ఆధార్ శిలా. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

LIC
LIC

 

ఇది కేవలం మహిళలకు మాత్రమే. పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఉంటుంది. మీకు నచ్చిన టర్మ్ ఎంచుకోవచ్చు. ఒకవేళ కనుక ఆధార్ శిలా పాలసీ తీసుకున్న వారు మరణిస్తే.. కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి. ఒకవేళ జీవించి ఉంటే మెచ్యూరిటీ తర్వాత పాలసీ డబ్బులు వాళ్ళకి ఇవ్వడమా జరుగుతుంది. 8 నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఆర్థిక భద్రత, పొదుపు వంటివి లక్ష్యంగా ఎల్‌ఐసీ ఈ పాలసీని తీసుకు వచ్చింది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియం డబ్బులను చెల్లించొచ్చు.

రూ.75 వేల మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.3 లక్షల వరకు మొత్తానికి పాలసీ పొందొచ్చు. ఇక ఎలా డబ్బులు వస్తాయనేది చూస్తే.. 25 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.3 లక్షల మొత్తానికి ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీ తీసుకుంటే… పాలసీ టర్మ్ 20 ఏళ్లు. ఇప్పుడు వీళ్లకు నెలకు రూ.900 వరకు ప్రీమియం.. ఈ లెక్కన రోజుకు రూ.29 ఆదా చేసి మెచ్యూరిటీ సమయంలో రూ.4 లక్షల వరకు పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news