వైయస్ జగన్మోహన్ రెడ్డి పలనాడు జిల్లా పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్… ఓ వృద్ధుడు మృతి చెందాడు. అతని కాన్వాయ్ ఢీకొట్టడంతో ఒక వృద్ధుడు కుప్పకూలాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాడేపల్లి నుంచి పల్నాడు వెళ్తుండగా లాల్పురం హైవేపై వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ లోని ఒక వాహనం… ఓ వృద్దున్ని ఢీ కొట్టింది.

దింతో ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తిరుగు ప్రయాణంలో ఆ వృద్ధుడి కుటుంబాన్ని… వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించే ఛాన్స్ ఉంది.
ఇక అటు పల్నాడు పర్యటన సందర్భంగా జగన్ కోసం భారీగా తరలివచ్చారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు. పోలీసుల ఆంక్షలు కొనసాగుతుండగావైఎస్ జగన్ను చూసేందుకు పొలాల మధ్యలో నుంచి రెంటపాళ్లకు వెళ్తున్నారు వైసీపీ అభిమానులు.