ఐఆర్‌సీటీసీ అదిరే టూర్… మేఘాలయని చుట్టేయచ్చు..!

-

ఐఆర్‌సీటీసీ ఇప్పటికే ఎన్నో టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. వీటి ద్వారా మనం ఈజీగా చూడాలనుకున్న ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. ట్రైన్, ఫ్లైట్స్ మీదుగా కూడా టూర్స్ వున్నాయి. కనుక ఇలా మీకు నచ్చిన టూర్‌కు వెళ్లొచ్చు. ఇక ఈ మేఘాలయ టూర్ గురించి పూర్తి వివరాలలోకి వెళ్ళిపోతే..

 

irctc meghalaya tourism

తాజాగా ఐఆర్‌సీటీసీ ఓ కొత్త టూర్ ప్యాకేజ్ ని స్టార్ట్ చెయ్యడం జరిగింది. దీనిలో భాగంగా మేఘాలయ చూడొచ్చు. అది కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పైన. నిజంగా ఎంత బాగుంటుందో కదా..? సినిమాటిక్ రేంజ్ లో ఈ ప్యాకేజీ వుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకుంటే ఎంతగానో ఎంజాయ్ చెయ్యచ్చు. ఇది ఇలా ఉంటే ఐఆర్‌సీటీసీ మేఘాలయ టూర్ నవంబర్ 13న ప్రారంభమౌతుంది. వారం రోజులు టూర్ ఉంటుంది. అయితే ఈ టూర్ గువాహటిలో స్టార్ట్ అవుతుంది.

గువాహటికి వెళ్ళాక రైల్వే స్టేషన్ లేదా ఎయిర్‌పోర్ట్ నుంచి మిమ్మల్ని పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ మీకు టూర్ పూర్తి వివరాలు తెలియజేస్తారు. అదే విధంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టూర్ లో భాగంగా మీరు షిల్లాంగ్, చిరపుంజి, షాంగ్‌డెంగ్ సహా పలు ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. టూర్ ప్యాకేజ్ ధర రూ.38,320 నుంచి ప్రారంభమౌతంది. కేవలం 10 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ టూర్ కోసం బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో బుక్ చేసుకోచ్చు. ఫుడ్, పెట్రోల్, హోటల్ ఖర్చు ఇలా అన్నీ ఐఆర్‌సీటీసీనే భరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news