ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వీటి గురించి తప్పక తెలుసుకోవాలి…

-

లైఫ్ ఇన్సూరెన్స్ ను అందరూ తీసుకుంటున్నారు.. అందుకు కారణం కూడా లేకపోలేదు. కరోనా తర్వాత అందరికి ఒక తెలియని భయం పట్టుకుంది..అందుకే గత రెండేళ్ళ తో పోలిస్తే ఇప్పుడు పాలిసీలు కూడా ఎక్కువ అయ్యాయి.దాంతో ఆయా కంపెనీలు కూడా కొన్ని ఆఫర్లను ప్రకటిస్తున్నారు.ఇకపోతే ఇన్సూరెన్స్ తీసుకోనే ముందు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలని అంటున్నారు.అవేంటో ఇప్పుడు చుద్దాము..

పాలసిని తీసుకోనేవాల్లు ఎనిమిది విషయాలను తప్పక తెలుసుకోవాలి..

* ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి పాలసీ హోల్డర్లకు అధిక రాబడిని అందిస్తాయని కంపెనీలు, ఏజెంట్లు పేర్కొంటారు.కానీ నిజానికి అవి చాలా భిన్నంగా ఉంటాయి.

* ఎవరైనా వ్యక్తులు లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం ప్రమోట్ చేసిన బీమా కంపెనీ పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైనదని భావించడమే. చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు లాగానే ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ నుంచి రాబడులు ఆశిస్తారు. అయితే ఇవి సూపర్ నార్మల్ రిటర్న్‌లు కాదు. రాబడులు ఎప్పుడూ 4-5 శాతం దాటవని వారికి తెలియదు.

* ఇన్వెస్ట్‌మెంట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లలో పెట్టుపడి పెట్టకపోవడమే మంచిదని సాధారణ పాలసీ హెల్డర్లు తెలుసుకోవాలి. ఏజెంట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల వలలో చిక్కుకోవద్దని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

* పోస్టాఫీసు స్కీమ్‌లు, FDలు కాకుండా, ఏ ఇన్వెస్ట్‌మెంట్ టూల్ రాబడికి హామీ ఇవ్వదు. కాబట్టి పాలసీ డాక్యుమెంట్‌లో రిటర్న్ హామీని చూపించమని మీ ఏజెంట్‌ని అడగండి. మూలధన హామీ పథకాలు వంటి కొన్ని పాలసీలు 8 శాతం రాబడిని అందిస్తాయి. అసలు రాబడిని తెలుసుకోవడానికి మీ ఏజెంట్‌ను XIRR లెక్కింపు వివరాలు అడగండి..పూర్తీ వివరాలు తెలుసుకోవడం మంచిది.

* గత పదేళ్ల రాబడి వివరాలు విశ్లేషిస్తే.. ఈ స్కీమ్స్‌లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోలిస్తే FDలు, ఫండ్స్‌లో పెట్టుబడి రాబడి కొన్ని రెట్లు అధికంగా పెరిగింది. ఇన్సూరెన్స్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు లిక్విడ్‌గా ఉండవు. స్కీమ్ బయటకు ముందుగానే వస్తే జరిమానా ఉంటుంది.

* కొంతమంది అత్యవసర పరిస్థితి కారణంగా స్కీమ్‌ నుంచి బయటకు వచ్చి భారీగా నష్టపోతుంటారు. ట్టుబడి పెట్టేటప్పుడు పారదర్శకత ముఖ్యం. అయితే చాలామంది ఏజెంట్లు లేదా బీమా కంపెనీలు రిటర్న్‌లు లేదా ఇతర నియమాలను స్పష్టంగా పేర్కొనవు.అందుకే భారీగా నష్ట పోతారు.

* పెట్టుబడి పెట్టడానికి ముందు ఎగ్జిట్/ఎర్లీ క్లోజర్‌పై అన్ని మార్గదర్శకాలను ముందుగానే తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈక్విటీలలో ఇన్వెస్టర్ ఫండ్స్‌ను ఇన్వెస్ట్ చేస్తాయి.ఇది మనకు మంచి ఫలితాలను అందిస్తుంది.

* ఇన్వెస్టర్లు పోర్ట్‌ఫోలియోలు లేదా ఖర్చులను తనిఖీ చేయరు. వీటికి బదులు డబ్బును నేరుగా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. బీమా అనేది లైఫ్‌పై రిస్క్‌ను రక్షించడం కోసమేనని గుర్తించాలి.ఇందుకు టర్మ్ ప్లాను కూడా అందుబాటులో ఉంటుంది.. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పాలసిని తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news