2021 Round up : ఈ ఏడాది విడిపోయిన సెలబ్రెటీ జంటలు వీళ్ళే…!

-

జీవితంలో వివాహం అనేది ఎంతో మధురమైనది. ఇష్టపడిన వారిని, కోరుకున్న వారిని పెళ్లి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ప్రేమలో అందరూ గెలుపొందలేరు. కోరుకున్న వాళ్లతో ఏడు అడుగులు వేయడం కూడా అందరికీ సాధ్యపడదు. అయితే కొందరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఏదో కారణాలవల్ల విడిపోవలసి వస్తుంది.

2021లో కొంతమంది సినీ ప్రముఖులు విడిపోయారు. సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. ఎంత వేగంగా ఒకటయ్యారో అంత వేగంగా విడిపోవడం జరిగింది. ఎంతో మంది క్యూట్ కపుల్స్ కూడా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ కి గుడ్ బాయ్ చెప్పేశారు. మరి ఆ విడిపోయిన ప్రముఖ సినీ ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అమీర్ ఖాన్, కిరణ్ రావు:

బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ తన భార్యతో విడాకులు తీసుకుని వాళ్ళ బంధానికి స్వస్తి చెప్పేశారు. వీరిద్దరూ 2006లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత జూలై 3న ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది.

సమంత, నాగ చైతన్య:

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్య కూడా ఈ సంవత్సరం విడాకులు ప్రకటన చేశారు. 2017 లో వీళ్ళ వివాహము జరిగింది. అక్టోబర్ 2న వీళ్ళ బంధానికి ముగింపు పలికేసారు.

నిషా రావల్‌, కరణ్‌ మెహ్ర:

సీరియల్ నటుడు కరణ్‌ మెహ్ర పై భార్య నిషా రావల్‌ గృహహింస ఆరోపణలు చేయడం జరిగింది. అది అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. 2012 లో వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అంటే ఈ సంవత్సరం వీరు విడాకులు తీసుకున్నారు.

నుస్రత్‌ జమాన్‌, నిఖిల్ జైన్:

జూన్‌ 19, 2019 లో నుస్రత్‌, వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ని టర్కీలో వివాహం చేసుకున్న నుస్రత్‌ 2021లో జైన్‌తో తన వివాహం అన్నారు. ఇలా వీరు కూడ విడిపోయారు.

యోయో హనీసింగ్, శాలిని తల్వార్:

హనీ సింగ్ పై భార్య షాలిని తల్వార్ గృహహింస కేసు పెట్టింది. 2011లో వీరు వివాహం చేసుకున్నారు. కానీ ఈ సంవత్సరం ఈ జంట విడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news