బీజేపీని దోషిగా నిల‌బెట్ట‌డ‌మే చంద్ర‌బాబు గేమ్‌: క‌న్నా

-

*అగ్రిగోల్డ్ బాధితుల‌కు బిజేపి అండ‌
అమ‌రావ‌తి (విశాఖ‌): 2019 ఎన్నికల్లో బీజేపీని దోషిగా నిలబెట్టడమే చంద్రబాబు అజెండా అని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం విశాఖలో అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా బీజేపీ నేతలు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. పోలవరం పూర్తయితే మోదీకి పేరు వస్తుందని చంద్రబాబు భయపడ్డారన్నారు. చంద్రబాబు పక్కన మనీ లాండరింగ్, సెక్స్ రాకెట్ నిందితులు ఉన్నారని కన్నా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాజకీయాలు తప్ప ప్రజాసమస్యలు పట్టవని విమర్శించారు. చంద్రబాబు తుఫాన్‌ నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకపోయారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుంటే ఆమరణ దీక్షకు సిద్ధమని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

హాయ్‌లాండ్‌ను కొట్టేయాల‌ని చూశారు- జీవీఎల్‌

హాయ్‌ల్యాండ్‌ను ప్రభుత్వ పెద్దలు కొట్టేయాలని చూశారని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. బీజేపీ పోరాటం వల్లే ఆస్తులు కొట్టేయాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వ పెద్దలు వెనక్కి తగ్గారని చెప్పారు. హాయ్‌ల్యాండ్‌పై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు గిలగిల కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యాపారులు, దొంగ నాయకులపై ఐటీ దాడులు చేస్తే ముఖ్యమంత్రికి ఎందుకంత భయమని వ్యాఖ్యానించారు. ఈ ధర్నాలో షానవాజ్ హుస్సేన్, పురందేశ్వరి త‌దిత‌రులు పాల్గొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news