భారత్ పై కరోనా పంజా.. దిమ్మతిరిగిపోయే స్థాయిలో కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 29,429 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,36,181కి చేరింది. అలాగే ఒక్క రోజులో 582 మంది చనిపోయారు. వీటితో మొత్తం కరోనా మరణాల సంఖ్య 24,309కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,19,840 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా నుండి మొత్తం 5,92,031 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news