కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫస్ట్ బెల్ 1000 మార్క్..!

-

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డాయి. అయితే విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకుండా… కేరళ ప్రభుత్వం జూన్​ 1న ‘ఫస్ట్​ బెల్’​ పేరుతో రాష్ట్ర అధికారిక ఛానెల్​ కైట్​ (కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ అండ్​ టెక్నాలజీ ఫర్​ ఎడ్యుకేషన్) విక్టర్స్​​ ద్వారా వర్చువల్​ తరగతులను ప్రారంభించింది. ప్రస్తుతం వాటి సంఖ్య 1000 దాటింది. ‘ఫస్ట్​ బెల్’​ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 604 ఆన్​లైన్​ క్లాసులను ప్రసారం చేసినట్లు కైట్​-విక్టర్స్​​ పేర్కొంది. కన్నడ మాధ్యమంలో 274, తమిళంలో 163 క్లాసులు ప్రసారం చేసినట్లు వెల్లడించింది.

facebook
facebook

టీవీ, స్మార్ట్​ఫోన్​, ఇంటర్నెట్, కంప్యూటర్​లో ఈ తరగతులను వీక్షించవచ్చని ఉపాధ్యాయులు తెలిపారు. విక్టర్స్​ వెబ్​సైట్​, మొబైల్​ యాప్​, సోషల్​ మీడియా పేజీల్లోనూ చూడొచ్చని పేర్కొన్నారు. www.facebook.com/victerseduchannel లింక్​ సహాయంతో ఫేస్​బుక్​లైవ్​ ద్వారా కూడా ఆన్​లైన్​ పాఠాలకు హాజరు కావచ్చని చెప్పారు. ఒకవేళ ఈ తరగతులకు హాజరు కాలేని విద్యార్థులు ప్రత్యమ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news