ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ

-

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆగస్టు 1 లోగా లోధి ఎస్టేట్​ నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రియాంకకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గురుగ్రామ్​లోని ఓ ఇంట్లో కొద్దిరోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Priyanka Gandhi
Priyanka Gandhi

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను గురువారం ఖాళీ చేశారు. ఢిల్లీలో ఆమె అద్దెకు తీసుకున్న నివాసంలో నవీకరణ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు గురుగ్రామ్​లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 1 లోపు లోధి ఎస్టేట్‌లోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రియాంక గాంధీకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నోటీసులు జారీ చేసింది. ఎస్​పీజీ భద్రత లేని వారికి ప్రభుత్వ బంగ్లాల్లో ఉండరాదన్న నిబంధనలను గుర్తుచేసింది.
ఈ బంగ్లా ఖాళీ చేసే నేపథ్యంలో అనేక రాజకీయ విమర్శలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ బంగ్లాను బీజేపీ నేత కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news