బ్రేకింగ్ : గుండెపోటుతో హాత్ వే రాజశేఖర్ మృతి

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్వో అధ్యక్షుడిగా పని చేసిన హాత్వే రాజశేఖర్ కన్నుమూశారు. కేబుల్ టీవీ రంగ ప్రముఖుడిగా, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతిగా ఉన్న ఈయన హాత్వే సంస్థ నుండి రెండేళ్ళ క్రితం విడిపోయారు. ఈరోజు ఉదయం జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారని చెబుతున్నారు. కంపెనీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఈయన ఒకప్పుడు కేబుల్ టీవీల కాలంలో చక్రం తిప్పాడు.

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఓ అధ్యక్షుడిగా కొన్ని సంవత్సరాలు పాటు పని చేసిన ఈయనకు బ్యాడ్మింటన్ సంఘం కూడా ఉంది. ఎంఎస్ఓ అధ్యక్షుడిగా ఏపీ, తెలంగాణ కేబుల్ ఆపరేటర్లను తన గుప్పిట్లో పెట్టుకున్నారనే చెప్పాలి. హాత్వే యాజమాన్యంతో మనస్పర్ధలు వచ్చి బయటకు వచ్చేసిన ఈయన ఎగ్జయిటైల్ అనే కంపెనీలో చేరారు. అయితే ప్రస్తుతం అంతా డైరక్ట్ టు హోం హవా నడుస్తుండడంతో ఈయనకు పెద్దగా పనిలేకుండా పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news