కరోనా నుంచి కోలుకున్న మంత్రి కన్నుమూత..?

-

రోజురోజుకూ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్ అందరినీ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులు సెలబ్రెటీలు అనే తేడా లేకుండా.. అందరిపై పంజా విసురుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణం తీస్తుంది. అయితే కరోనా వైరస్ బారి నుంచి కోరుతున్న ఎంతోమంది మళ్లీ అనారోగ్యం బారిన పడుతున్న విషయం తెలిసిందే . ఇక ఇటీవల కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకొని కోలుకున్న మంత్రి… రోజుల వ్యవధిలోనే అనారోగ్యం బారిన పడి మృతి చెందిన ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది.

బీహార్ మంత్రి వినోద్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. జూన్ లో కరోనా వైరస్ బారిన పడిన ఆయన నెలన్నర తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు ఇక ఇటీవలే ఆసుపత్రికి వెళ్లగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయారు బీహార్ మంత్రి వినోద్ కుమార్. బీహార్ ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం వినోద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి ఆయన భార్య ను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది బీజేపీ.

Read more RELATED
Recommended to you

Latest news