ఏపీ సీఎస్‌తో ప‌లువురు భేటీ

-


అమరావతి: విశాఖపట్నం షిప్ బిల్డింగ్ కేంద్రం రియర్ అడ్మిరల్ మరియు పిడి కె.శ్రీనివాస్ గురువారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు వివిధ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కెప్టెన్ సాంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వి.శేఖర్ గురువారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన వివిధ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల వివరాలను తెలియజేయడంతో పాటు ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల ప్రగతిని ఇడి సిఎస్‌కు వివరించారు.

అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఏర్పడుతున్న వివిధ సమస్యలు సంబంధిత వివిధ అంశాలను ఆయన సిఎస్ దృష్టికి తీసుకువచ్చారు. అనంత‌రం సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ మాట్లాడుతూ రాష్ట్రంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన వివిధ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news