భర్తపై కోపం.. భవనంపై నుంచి 14 రోజుల పసికందును పడేసిన తల్లి.. చివరికి..?

-

ఈ మధ్యకాలంలో తెర మీదకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి. ప్రపంచంలోనే ఎంతో గొప్పది అని భావించే తల్లి ప్రేమకు కళంకం తెచ్చే విధంగా ప్రస్తుతం ఎంతో మంది మహిళలు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ తల్లి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ విషయంలో కసాయిగా మారిపోయింది. ఏకంగా భర్త మీద కోపంతో ముక్కుపచ్చలారని చిన్నారిని భవనం పైనుంచి కింద పడేసి దారుణంగా హతమార్చింది తల్లి.

ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ లో వేణుగోపాల్ లావణ్య దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నారు. గత కొంత కాలం నుంచి భార్య భర్తల మధ్య మనస్పర్థల కారణంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గర్భందాల్చిన లావణ్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవలే ప్రస్తావించగా బిడ్డకు జన్మనిచ్చింది అయితే భర్త పై కోపంతో ఏకంగా 14 రోజుల పసికందును మూడో అంతస్థు పైనుంచి కిందకు పడేయాడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news