నడ్డాను కలిసిన విజయశాంతి.. చేరిక ఖరారు !

-

తెలంగాణా రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న అంశం ఏదయినా ఉందా అంటే అది విజయశాంతి పార్టీ మార్పు అనే చెప్పాలి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఈమె పార్టీ మారుతుందని కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ అంశం మీద ఆమె ఎప్పుడూ స్పందించకపోయినా ఆమె బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్ళడంతో ఆమె పార్టీ మారుతుందని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు.

కానీ ఎప్పుడు మారుతుందనే అంశం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. అయితే తాజాగా హైదరాబాద్ ప్రచారం కోసం వచ్చిన నడ్డాను విజయశాంతి కలిసినట్టు చెబుతున్నారు. మర్యాద పూర్వకంగానే ఆమె కలిసినట్టు చెబుతున్నారు. అయితే, రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న అమిత్ షా సమక్షంలో ఆమె కండువ మార్చే అవకాశం కనిపిస్తోంది. రేపు అమిత్ షా రోడ్ షో లో అధికారికంగా ఆమె పార్టీ మారే అవకాశం మెండుగా కనిపిస్తోందని చెప్పచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news