జిహెచ్ఎంసి ఎన్నికలు.. నేను వచ్చేస్తున్నా అంటున్న కే ఏ పాల్..!?

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి అనే విషయం తెలిసిందే. ప్రచారానికి నిన్నటికే తెర పడినప్పటికీ ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా పూర్తిగా వాతావరణం హాట్ హాట్ గానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు ఉదయం నుంచి జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. అయితే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు అన్న విషయం తెలిసిందే.

ఇటీవలే సోషల్ మీడియా వేదికగా జిహెచ్ఎంసి ఎన్నికల గురించి స్పందించిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు జరగబోయే ఎన్నికలలో ఎవరు కూడా కులమతాలను చూడకుండా ఓట్లను అమ్ముకోకుండా.. కర్తవ్యంగా భావించి ఓట్లు వేయాలి అంటూ సూచించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని సూచించిన కేఏపాల్ అతి త్వరలో తాను హైదరాబాద్ వస్తున్నాను అంటూ తెలిపాడు ఏపీ తెలంగాణలో త్వరలో ఓ గొప్ప మార్పు రాబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు కే ఏ పాల్.

Read more RELATED
Recommended to you

Latest news