చిత్తూరు జిల్లాలో హై టెన్షన్.. ఎక్కడిక్కడ అరెస్ట్ లు !

-

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కురబల కోట మండలం అంగళ్లు వద్ద టీడీపీ నేతలపై వైసీపీ నిన్న దాడులు చేసిన సంగతి తెలిసిందే. నిరసనగా చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి చలో తంబళ్లపల్లి కార్యక్రమానికి టీడీపీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. చలో తంబళ్లపల్లి ని కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ అడ్డుకుంటున్న పోలీసులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు.

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయగా కలికిరి నగిరి పల్లికి భారీగా చేరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కలకడలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూరి ప్రకాష్ ని హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు.  పలమనేరు లో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ,  చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు పులివర్తి నాని, శాంతిపురంలో ఎమ్మెల్సీ గౌరవాన్ని శ్రీనివాసులుతో సహా పలువురు ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news