తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా నవీన్ చంద్ ?

-

ఈ నెల 17తో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల పదవీ కాలం ముగుయనుంది. ఛైర్మెన్ గా 6 ఏళ్ల పాటు గంఠా చక్రపాణి వ్యవహరించారు. కొత్త చైర్మెన్ రేసులో విఠల్, రిటైర్డ్ ఐజి నవీన్ చంద్ లు ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా లో ఉన్న నవీన్ చంద్ ను ఇండియా కు రావాలని సీఎం కార్యాలయం పిలుపు ఇచ్చి నట్లు సమాచారం.

రాజ్యసభ యభ్యుడు కెప్టెన్ లక్మి కాంత రావు కు అల్లుడైన నవీన్ చంద్ దాదాపుగా ఖరారు అయినట్టేనని అంటున్నారు. ఇక తాజాగా ఉద్యోగాలా భర్తీ కూడా ఉండనుందని కేసీఆర్ ప్రకటించిన నేపధ్యంలో ఈ అంశం మీద అందరిలోనూ మరింత ఆసక్తి నెలకొంది. అయితే తెరాస వర్గాల సమాచారం మేరకు అయితే దాదాపుగా నవీన్ చంద్ పేరు ఖరారు అయినట్టే. చూడాలి మరి ఎవరి పేరు ప్రకటిస్తారో ?

Read more RELATED
Recommended to you

Latest news