తిరుపతి బరిలో జనసేన.. హింట్ ఇచ్చిన పవన్ ?

-

తిరుపతి లోక్ సభలో బీజేపీ పోటీ చేస్తుందా ? లేక జనసేన పోటీ చేస్తుందా అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇక బీజేపీ పోటీలో ఉంటుందని బీజేపీ నేతలు ప్రకటించుకున్న నేపద్యంలో జనసేన పోటీలో ఉండండని భావించారు. అయితే తామింకా పోటీలో నుండి తప్పుకోలేదని హింట్ ఇచ్చారు పవన్. తిరుపతి లోక్ సభ పరిధిలో జనసేన కార్యనిర్వాహక కమిటీ ని ప్రకటింకారు పవన్ కళ్యాణ్. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో  పార్టీ శ్రేణులను సమాయత్తపరచేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సభ్యులను ఆదేశించారు.

కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా డా.పి.హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, రాందాస్ చౌదరి, కిరణ్ రాయల్, శ్రీమతి వినుత,     పొన్న యుగంధర్, ఉయ్యాల ప్రవీణ్,  తీగల చంద్రశేఖర్,  గూడూరు వెంకటేశ్వర్లు, కంటేపల్లి ప్రసాద్ ఉండనున్నారు. ఈ కమిటీ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో పర్యటనలు చేస్తుందని,  క్షేత్ర స్థాయిలో శ్రేణులను సమన్వయం చేసుకొంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తారని పవన్ పేర్కొన్నారు.  ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా సమస్యలను, రాజకీయ సంబంధిత విషయాలను క్రోడీకరించి ఎప్పటికప్పుడు  నివేదికలు అందచేస్తారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news