యువకుడి దారుణ హత్య..అమ్మాయి గురించేనా ??

-

గుంటూరు జిల్లా తాడేపల్లిలో యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద స్థితిలో అతని మృత దేహం కాలువలో దొరికింది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం అని చెబుతున్నారు.  వెంపాటి సాయి అనే విద్యార్థిని దారుణంగా కొట్టి కాలువలో పడేసారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమ్మాయి వ్యవహారంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వివాదం మొదలయిందని తెలుస్తోంది.

నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్లో  తమ  కుమారుడు కనిపించటంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గత రాత్రి అనుమానం కింద మొత్తం 11 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే అనంతరం నిన్న పొద్దుపోయాక యువకుడి శవం కాలువలో దొరికింది. అయితే ఎవరో  దారుణంగా కొట్టి కాలువలో పడేసారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news