టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కొడుకుని కలిసిన షర్మిల.. ఏం జరుగుతోంది?

-

వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందని తెలిసినప్పటి నుండి రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం బలంగా ఉన్న పార్టీ అంటే టీఆర్ ఎస్ ఒక్కటే అని చెప్పవచ్చు. మిగిలిన పార్టీలు వాటి ప్రాభాల్యాన్ని దాదాపుగా పోగొట్టుకున్నాయి. ఐతే టీఆర్ ఎస్ కి పోటీగానే షర్మిల పార్టీ పెడుతుందన్న వాదనలు అనేకం వినిపిస్తున్నాయి. అది నిజమే అన్నట్లుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా వాటికి దోహదం చేస్తున్నాయి.

తాజాగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కొడుకు షర్మిల కలవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కొడుకు షర్మిలని కలుసుకున్నట్లుగా సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి నేతలతో చర్చలు జరుపున్న షర్మిలని కాలే యాదయ్య కొడుకు రవికాంత్ కలిసాడని పలు విషయాలపై చర్చలు జరిగాయని సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడి వేడిగా తయారవుతున్నాయి. మరి ముందు ముందు ఏం జరగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news