సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇంఛార్జిగా తమిళిసై

-

బీజేపీ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై కి కీలక పదవి కట్టబెట్టింది బీజేపీ పార్టీ. సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇంఛార్జిగా మాజీ గవర్నర్ తమిళిసై నియామకం అయ్యారు.

Ex-governor Tamilisai is BJP in-charge of Secunderabad Parliament

దీంతో నేటి నుండి ఎన్నికల వరకు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు తమిళిసై. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బీజేపీ పార్టీ. కాగా, తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. చెన్నై సౌత్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై బరిలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news