మహిళా దినోత్సవం రోజు దారుణం.. ఆడపిల్ల చెత్త కుండీ పాలు..

-

మహిళా దినోత్సవం రోజు దారుణం జరిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గోనె సంచిలో కట్టి చెత్త కుండీలో వేశారు కసాయి తల్లిదండ్రులు. బురుగు పాడు గ్రామ కూలీలు వ్యవసాయ పనికి వెళ్లే క్రమంలో శిశువు కేకలతో కనిపెట్టిన కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించారు..

గొనె సంచి లో నుంచి తీసి ఏరియా హాస్పిటల్ కు తరలించారు గ్రామస్తులు. ఇక డోర్నకల్ సీఐ శ్రీనివాస్ వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆడపిల్ల పుట్టడమే పాపమా అని గ్రామస్తులు కంట తడి పెట్టిన ఘటన సంచలనంగా  మారింది. ఈ సంఘటనకు పాల్పడ్డ కసాయి తల్లిదండ్రులను వదలొద్దు మరో శిశువు కి ఇలాంటి పరిస్థితి రావద్దని కోరుతున్నారు గ్రామస్తులు. శిశువు పరిస్థితి నిలకడగానే ఉందని అంటున్నారు వైద్యులు. 

Read more RELATED
Recommended to you

Latest news