బెంగాల్ నందిగ్రామ్ ఎందుకంత స్పెషల్..

-

ప్రస్తుతం బెంగాల్ ఎన్నికలు టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తున్నాయి. మమతా బెనర్జీ నందిగ్రామ్ లో నామినేషన్ కి వచ్చి గాయపడిన దగ్గర నుండి ఈ టాపిక్ మరింత చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. నందిగ్రామ్ లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కాకపోతే ప్రస్తుతం రాజకీయం అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. అసలు నందిగ్రామ్ ఇంత ఆసక్తికరం కావడానికి ప్రత్యేక కారణం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ లో ఉండే సుబేందు బీజేపీలోకి చేరడమే ఇంత చర్చ పెట్టుకోవడానికి కారణం అయ్యుంటుందని తెలుస్తుంది.

దాదాపు 40నియోజక వర్గాల మీద పట్టున్న సుబేందు, బీజేపీలోకి మారడం మమత బెనర్జీకి కోలుకోలేని దెబ్బే. కానీ ఆమె దాన్ని సవాలుగా తీసుకుంది. అందుకే నందిగ్రామ్ లో పోటీ చేయు అని సవాల్ విసిరిన సుబేందుకి ఛాలెంజిగా నామినేషన్ వేసింది. బెంగాల్ లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news