ఎవరు మీలో కోటీశ్వరులు.. మీ రామారావు అంటూ ప్రోమోలో అదరగొట్టిన ఎన్టీఆర్ !

-

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహా తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే ఎన్టీఆర్‌ హోస్ట్ గా అధికారిక ప్రకటన వచ్చేసింది. కొద్ది సేపటి క్రితం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. అలానే ప్రోమోని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో సైతం `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఆయన కొమురంభీమ్‌ గెటప్‌లో కనిపించడం విశేషం.

తాజాగా విడుదలైన ప్రోమో ట్రెండ్‌ అవుతుంది. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానుంది. గతంలో మాటీవీలో ప్రసారమైన ఈ షో నాలుగో సీజన్‌ ఇప్పుడు జెమినీ టీవీలో రాబోతుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఎన్టీఆర్‌ `ఎవరు మీలో కోటీశ్వరులు` గురించి పలు కీలక అంశాలను వివరించారు. `ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం` అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. చివరగా `మీ రామారావు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు` అని ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడం ప్రోమో మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news