ఈట‌ల స్వ‌గ్రామంలో వినూత్న నిర‌స‌న‌.. చెరువులోకి దిగి..

-

ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ప్ప‌టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్ల‌వెత్తుతున్నాయి. ఆయ‌న అభిమానులు రోడ్డెక్కి దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేస్తున్నారు. ఇక ఈట‌ల సొంతూరైన క‌మలాపూర్ లో వినూత్నంగా నిర‌స‌న తెలిపారు.

గురువారం గ్రామ‌స్తులు గ్రామంలోని చెరువులోకి దిగి నినాదాలు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్ కుట్ర పూరితంగా ఈట‌ల‌ను తొల‌గించారంటూ ఆగ్ర‌హం తెలిపారు. త‌గిన మూల్యం చెల్లించుకుంటారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆరోప‌ణ‌లు ఉన్న మిగ‌తా వారిని కూడా తొల‌గించాలంటూ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news