కావలి, ఆత్మకూరు నియోజకవర్గాలలో టీడీపీకి గ్లాస్‌ గుర్తు టెన్షన్‌ !

-

కావలి, ఆత్మకూరు నియోజకవర్గాలలో టీడీపీకి గ్లాస్‌ గుర్తు టెన్షన్‌ పెడుతోంది. నెల్లూరు జిల్లాలోని కావలి, ఆత్మకూరు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ కు క్లాస్ గుర్తు కేటాయించారు ఎన్నికల అధికారులు.

In Kavali and Atmakuru constituencies, the glass mark for TDP is tension

2019 ఎన్నికల్లో జన సేన అభ్యర్థిగా గ్లాస్ గుర్తుపై పోటీ చేశారు సుధాకర్. ఆ ఎన్నికల్లో 10 వేల 647 ఓట్లు సాధించారు సుధాకర్. ప్రస్తుత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో టిడిపి వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. ఇక అటు ఆత్మకూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి ధని రెడ్డి రామనారాయణ రెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించారు అధికారులు. దీంతో టిడిపికి పడే ఓట్లు చీలుతాయని నేతలు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news