రఘురామ విషయంలో క్లియర్ గా డిలే చేయోద్దన్న సుప్రీం కోర్ట్

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామను వెంటనే సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని పేర్కొంది. వైద్య పరిక్షలకు సంబంధించి వీడియో కూడా తీయాలని ఒక జ్యూడిషియల్ అధికారి ని తెలంగాణా హైకోర్ట్ నియమించాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది.

ఇక రఘురామను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని కూడా సుప్రీం కోర్ట్ పేర్కొంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెయిల్ చేసామని కూడా పేర్కొంది. దీనితో ఏం జరగబోతుంది అనే ఆసక్తి పెరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రఘురామ విషయంలో ఆలస్యం చేసే విధంగా కనపడుతుంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news