టిపిసిసి ఎంపికపై సోనియా గాంధీ కీలక భేటీ.. ఇవాళే కీలక ప్రకటన

-

తెలంగాణ పిసిసి పదవిపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అసలు అధిష్టానం పిసిసి పదవిని నియమిస్తుందా లేదా అనే సందేహాలు కూడా కొందరు నాయకులలో వచ్చాయి. అటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్ష పదవి నాకంటే నాకు అని పోటీ పడుతున్నారు. రెడ్డిలకు ఇవ్వాలని కొందరు అంటుంటే.. కాదు, కాదు బీసీలే కరెక్ట్ అంటూ మరికొందరు నాయకులు అధిష్టానం ముందు తమ, తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. అయితే ఈ పీసీసీ పదవి ఎంపికకు కౌంట్ డౌన్ మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కీలక భేటీ నిర్వహించనుంది కాంగ్రెస్ అధిష్టానం.

సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరుగనుంది. సోనియా గాంధీతో భేటీ కానున్నారు తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్. దీంతో ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోనియా గాంధీని ఏ క్షణంలో నైనా మాణిక్ ఠాగూర్ కలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే పీసీసీపై ఈ రోజు సమావేశంలో అంతిమ నిర్ణయం కానున్నట్లు సమాచారం. ఏ క్షణంలో నైనా అధిష్ఠానం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news