కొట్లాటకు దారి తీసిన సైకిల్ రేస్.. కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

-

కర్నూలు: సైకిల్ పందెం కొట్లాటకు దారి తీసింది. మంత్రాలయం మండలం వగరూరులో రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వగరూరులో తీవ్ర టెన్షన్ నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయినా రెండు వర్గాలు శాంతించలేదు. రాళ్లు, కర్రలతో దాడులు కొనసాగించారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.

మంత్రాలయం మండలంలో నిన్న కూడా ఇలాంటి గొడవే జరిగింది. సుంకేశ్వరిలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకలు రణరంగంగా మారాయి. ఎద్దుల పరుగు పందెంలో ఇరువర్గాల మధ్య అగ్గి రాజేసింది. కర్రలు, రాళ్లు, ఢీ అంటే ఢీ అన్నాయి. రక్తం ఏరులై పారింది. ఓ వర్గానికి చెందిన వారు వృషభం పారువేటలో విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేని మరోవర్గం కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడికి దిగింది. తామేం తక్కువ అన్నట్టుగా మరో వర్గం కూడా ప్రతి దాడికి దిగింది. ఇరువర్గాల కొట్లాటతో సుంకేశ్వరిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news