ఒలింపిక్స్‌లో భారత్ దూకుడు.. హాకీ జట్టు శుభారంభం

-

జపాన్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు దూకుడు పెంచారు. భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం సాగించింది. పూల్ ఏ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించారు. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైన‌ల్‌కు భారత్ అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3తేడాతో దీపికాకుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం అందుకున్నారు. క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాతో భారత్ అవకాశం తలపడే అవకాశం ఉంది.

 

టోక్యో ఒలింపిక్స్ | Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్ | Tokyo Olympics

అయితే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్‌లో భారత్‌కు నిరాశ మిగిలింది. భారత మహిళా షూటర్లు ఫైనల్‌కు చేరలేకపోయారు. 625.5 పాయింట్లతో 16వ స్థానంలో ఎలవెనిన్ వలేరియన్ నిలిచారు. 621.9 పాయింట్లతో  అపూర్వి చందేలా 36వ స్థానంలో నిలచారు. మరోవైపు చైనా కూడా దూసుకుపోతోంది. 10 మీ ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో యాంగ్ క్వియాన్‌కు తొలి స్వర్ణం దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news