ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం పై ట్విస్ట్!

-

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం పై హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయగా.. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ అఫిడవిట్‌ దాఖలు చేసారు చెన్నమనేని. అయితే.. తాజాగా ఇవాళ ఈ కౌంటర్ పిటిషన్ లపై ఇరు వాదనలను హైకోర్టు విన్నది.

సెక్షన్ 5 (1) f సిటిజన్ షిప్ యాక్ట్ 1955 చెన్నమనేని భారత పౌరసత్వం పొందడానికి అర్హుడని కోర్టుకు తెలిపిన చెన్నమనేని తరపు న్యాయవాది.. ఎన్నికల్లో పాల్గొనడానికి పూర్తి అర్హత ఉందని కోర్టుకు స్పష్టం చేశారు. ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచాడని కోర్టు కు తెలిపారు చెన్నమనేని తరపు న్యాయవాది. భారత పౌరుడిగా ఉండి జర్మనీ వెళ్లి వచ్చాడని తెలిపారు చెన్నమనేని తరపు న్యాయవాది. అయితే… చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని కోర్టుకు తెలిపారు ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది. ఇప్పటి కూడా చెన్నమనేని రమేష్ జర్మనీ లో ఉన్నాడని స్పష్టం చేశారు పిటీషనర్ తరపు న్యాయవాది. భారత ప్రభుత్వానికి ఓసిఐ కార్డ్ కోసం అప్లయ్ చేశాడని కోర్టుకు తెలిపిన పిటీషనర్ తరపు న్యాయవాది.. కేంద్ర హోమ్ శాఖ కూడా చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు తెలిపిందని గుర్తు చేశారు. అయితే.. దీనిపై స్పందించిన చెన్నమనేని తరపు న్యాయవాది..

Read more RELATED
Recommended to you

Latest news