జనసేన కార్యకర్తలకు రూ.5 లక్షలు ప్రకటించిన పవన్ కళ్యాణ్

-

తూర్పుగోదావరి : జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వాల నమోదులో నాదెండ్ల మనోహర్ , జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇవాళ పాల్గొన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సురెన్స్ పత్రాలు, మెడికల్ కిట్లు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ అందజేశారు.

అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మార్పు కోరుకుంటూ యువత జనసేనలో చేరుతున్నారని… నాలుగు నెలల్లో ఐదు లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా చేరారని తెలిపారు. దేశంలో జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ , 50 వేల రూపాయలు మెడికల్ క్లైమ్ అందజేస్తోందని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ లో జన పార్టీని పటిష్టం గా ఏర్పాటు చేసేందుకు యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news