వివేకా కేసులో కోటి రూపాయలు రివార్డు ఇవ్వండి : రఘరామ

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా నందరెడ్డి హత్య కేసులో సమాచారం ఇచ్చేవారికి ప్రాణ భయం తప్పకుండా ఉంటుందని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘరామ కృష్ణరాజు పేర్కొన్నారు. సీబీఐ ప్రకటించిన రూ. 5 లక్షల రివార్డు ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. సమాచారం అందించే వారికి రూ. కోటి రివార్డు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ మీడియా తో మాట్లాడారు.

raghu
raghu

వివేకా నంద హత్య కేసు సత్వర విచారణ లో భాగంగానే సీబీఐ రివార్డు ప్రకటించి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా… తాజాగా మాజీ మంత్రి వైఎస్‌ వివేకా నందరెడ్డి హత్య కేసులో ఏ దైనా సమాచారం ఇచ్చిన వారికి రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ పత్రికా ప్రకటన ఇచ్చిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యం లోనే ఎంపీ రఘరామ కృష్ణరాజు తాజాగా కోటి రివార్డు ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news