కేటీఆర్ తో కోదండరాం.. రేర్ ఫోటో వైరల్

-

తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరామ్ కనిపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కోదండరామ్ కొద్ది రోజుల పాటు టీఆర్ఎస్ కి కాస్త దగ్గరగా ఉన్నప్పటికీ ఆ తరువాత దూరంగానే ఉన్నారు. కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ప్రొ.కోదండరామ్ సార్ సూచనలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి పదవీ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకొని 2018 ఎన్నికల్లో బరిలోకి దిగారు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తరువాత 2023లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో ప్రొ.కోదండరామ్ కి ఎమ్మెల్సీ పదవీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక బీఆర్ఎస్ నేతలకు చాలా దూరంగానే ఉంటున్నారు. తాజాగా రవీంద్రభారతిలో కమ్యూనిస్టు యోదుడు సీతారాం ఏచూరి సంస్మరణ సభలో కేటీఆర్, ప్రొ.కోదండరామ్ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రేర్  ఫొటో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news