గాంధీభవన్‌లో రాజ్యసభ ఎంపీ, కొత్త పీసీసీ చీఫ్‌‌కు సన్మానం

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి వద్ద గల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్‌లో వైసీపీ రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను చూసి అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉత్తర తెలంగాణ జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆర్.కృష్ణయ్య అక్కడికి వచ్చారు.కొత్త పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్ గౌడ్‌ను సన్మానించారు.

అయితే,బీసీ నేత, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయిన మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఆర్.కృష్ణయ్య సన్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, బీసీల కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news