మోడల్ బైకుల పేరుతో యువకులకు షాక్..!

-

బైకులు అంటే కుర్రాళ్ళకు ఎంత మోజు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త మోడల్ బైక్ లను నడిపేందుకు ఇష్టపడుతుంటారు. అయితే దాన్ని సొమ్ము చేసుకోవాలని చూశాడు ఓకే కేటుగాడు.. గాజువాక కు చెందిన మెకానిక్ అహ్మద్ బైకుల రీమోడలింగ్ పేరుతో పలు జిల్లాల యువకులను మోసం చేశాడు. బైక్ లను దొంగలించి రీ మోడలింగ్ పేరుతో మెకానిక్ అహ్మద్ యువకులను మోసం చేస్తున్నాడు. గాజువాక కేంద్రంగా బైకుల దొంగతనాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అహ్మద్ గురించి తెలియక యువకులు భారీగా అతడికి వాహనాలను అపగించారు. తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి లో దొంగలించిన వాహనాలను గాజువాక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము మోసపోయామని తెలియడంతో యువకులు షాక్ అవుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. యువకులు మోడల్ బైకులు కొనే విషయం లో మెకానిక్ లకు ఇచ్చే విషయం లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news