దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి చూపిస్తున్న బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాలకు నేడు విడుదల కానున్నాయి. త్రుణమూల్ కాంగ్రెస్ తోపాటు మమతాబెనర్జీకి ఇవి చాలా కీలకమైన ఎన్నికలు. సెప్టెంబర్ 30 తేదీన బెంగాల్ లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈసీ ఎన్నికలను నిర్వహించింది. అందులో భవానీపూర్ చాలా కీలకమైంది. మమతా బెనర్జీ ఇక్కడ నుంచి పోటీ చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలు ఎక్కువ ప్రాధాన్యతనలు సంతరించుకుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం లో త్రుణమూల్ కాంగ్రెస్ మెజారిటీ సాధించినా.. మమతా బెనర్జీ గట్టెక్కలేకపోయింది. నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన దీదీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. అయినా సీఎం పీఠంను అధిష్టించినా ఆరు నెలల్లో అసెంబ్లీలో ప్రాతినిథ్యం సంపాదించాలి. దీంతో షబన్ దేవ్ ఛటోపాద్యాయ భవనీపూర్ ను దీదీ కోసం త్యాగం చేశారు. దీంతో భవానీ పూర్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో దీదీకి పోటీగా బీజేపీ తరుపున ప్రియాంక దిబ్రేవాల్ పోటీలో ఉన్నారు.
దీదీ భవితవ్యం తేలేది నేడే..
By Advik
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
జగన్వి నకిలీ నవరత్నాలు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్ది నకిలీ నవరత్నాలు అని...
Ganesh -
4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది...
Ganesh -
IPL 2024 : ఆల్ అవుట్ అయిన గుజరాత్… బెంగళూరు టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్...
Ganesh -