13 వ రౌండ్ లో 1,865 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ…

-

హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ లో బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన దూకుడును కొనసాగిస్తున్నారు. ఉత్కంఠ భరితమైన ఈ హుజరాబాద్ నియోజకవర్గం పోలింగ్ లో… కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈటల రాజేందర్ ఆధిక్యం లోనే కొనసాగుతున్నారు. హుజురాబాద్‌ కౌంటింగ్ లోని 13 వ రౌండ్ల లో కూడా ఫ‌లితాలు బిజేపి పార్టీ కే అనుకూలంగా వచ్చాయి.

13వ రౌండ్ లో 1865 ఓట్ల ఆధిక్యం సంపాదించింది బీజేపీ పార్టీ.. దీంతో 13 వ రౌండ్ ముగిసే సరికి 8388 ఆధిక్యంలోకి వచ్చారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఇక 13 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ పార్టీ కి 58,333 ఓట్లు పోల్ అయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ కి 49,945 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక మరో 9 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇక అటు పోస్టల్ బ్యాలెట్, 8 వ రౌండ్ మరియు 11 వ రౌండ్ లో మాత్రం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ అధిఖ్యం లోకి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news